Telangana

ఒక కోటి 40 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు, ముత్తంగి డివిజన్ పరిధిలోని నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని నందన్ ప్యారడైజ్ కాలనీలో 67.5 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్లు, ముత్తంగి డివిజన్ పరిధిలోని డిఎన్ కాలనీలో 36.5 లక్షల రూపాయలతో చేపట్టనున్న పైపులైను నిర్మాణ పనులు, వెలిమల స్మశాన వాటికలో 36.08 లక్షల రూపాయలతో చేపట్టనున్న రిటైనింగ్ వాల్ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్‌చెరు నియోజకవర్గంలోని ప్రతి కాలనీని అన్ని మౌలిక సదుపాయాలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అన్నారు. ప్రజలకు అవసరమైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు, వీధి దీపాలు వంటి మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తూ సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

 

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమాల్లో ఇంజనీరింగ్ విభాగం ఈఈ సురేష్, డిఈ కృష్ణవేణి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాములు గౌడ్, శ్రీకాంత్ గౌడ్, విజయ్ కుమార్, ఉపేందర్, దేవేందర్ యాదవ్, కొమరయ్య, శ్రీశైలం, ఉమేష్, నాగరాజు, రవీందర్ రెడ్డి, నర్రా బిక్షపతి, కుమార్ గౌడ్, ప్రభాకర్, మేరాజ్ ఖాన్ రామకృష్ణ వెంకటేష్, అశోక్, రాజ్ కుమార్, రామకృష్ణ, రవి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago