పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
బల్దియ పరిధిలోని డివిజన్లను ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ నేతాజీ నగర్ కాలనీలో 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సమావేశంలో ఆయన మాట్లాడుతూ పటాన్చెరు డివిజన్ పరిధిలో సిసి రోడ్ల నిర్మాణ పనుల కోసం ప్రభుత్వం ఇటీవల ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగ నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీఠ వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, భారత్ రాష్ట్ర సమితి పట్టణ అధ్యక్షులు అఫ్జల్, బండ్లగూడ ఏరియా అధ్యక్షులు గోపాల్, కొమరగూడెం వెంకటేష్, చంద్రశేఖర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వ్యర్థాల నుంచి సంపద (శ్రేయస్సు)ను సృష్టిస్తున్న హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఐఐటీ…
ప్రతిష్టాత్మక సదస్సులో కీలకోపన్యాసం చేసిన సీఎస్ఈ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు…
ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఐఐటీ హైదరాబాదు అధ్యాపకుడు డాక్టర్ ప్రభాత్ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రకృతి, భౌతికశాస్త్రం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి…