Telangana

పాటి గ్రామంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

క్రీడా రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, పటాన్చెరును క్రీడలకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలం పాటి గ్రామంలో జై భజరంగ్ బలి కబడ్డీ టీం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలను శుక్రవారం రాత్రి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్రీడా రంగానికి పెద్ద పీట వేయడంతో పాటు, క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గం లో క్రీడల అభివృద్ధి కోసం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఐదు ఎకరాల సూచనలతో మూడు మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు. దశాబ్దాల చరిత్ర కలిగిన పటాన్చెరువు మైత్రి మైదానాన్ని ఇటీవల ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర, జాతీయ పోటీలకు మైత్రి మైదానం వేదికగా నిలుస్తుందని తెలిపారు. విద్యార్థి దశ నుండే క్రీడ రంగం పట్ల శ్రద్ధ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, స్వామి గౌడ్, గ్రామ ప్రజా ప్రతినిధులు, నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

19 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

20 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago