అమీన్పూర్,,మనవార్తలు ప్రతినిధి :
మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ షిరిడి సాయి కాలనీలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్లను ఆయన ప్రారంభించారు. అనంతరం జవహర్ నగర్ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 9 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మన ఊరు మనబడి పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. అనంతరం కృష్ణారెడ్డిపేట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, గ్రామ సర్పంచ్ నితీశా శ్రీకాంత్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాస రావు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…