పటాన్చెరు
వర్షాకాలం లో పశువులకు వచ్చే గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు ప్రభుత్వం ఉచితంగా టీకాలను అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలోని గోశాలలో టీకా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూక్ష్మమైన అప్తో వైరస్ నుండి గాలి ద్వారా ఈ వ్యాధి సోకుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం దూరదృష్టితో ప్రతి పశువుకు ఉచితంగా టీకా అందించేలా కార్యక్రమం రూపొందించిందని తెలిపారు. ప్రతి గ్రామంలో పశు వైద్య అధికారులు పర్యటిస్తారని, రైతులు విధిగా తమ పశువులకు టీకా వేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పశువైద్య విభాగం జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, గోపాల్, నారాయణ రెడ్డి, లక్ష్మణ్, గోశాల నిర్వాహకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…