కోవిడ్ మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకోండి
పటాన్ చెరు:
జిహెచ్ఎంసి పరిధిలో వంద శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన మొబైల్ వాక్సినేషన్ డ్రైవ్ ను 18 ఏళ్లు పై బడిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మొబైల్ వాక్సినేషన్ డ్రైవ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకునేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని భారతి నగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్ల పరిధిలో ప్రతి కాలనీలో మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు వాక్సినేషన్ వేయించుకొని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవి కిరణ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, ఇమ్రాన్, వీరా రెడ్డి, బల్దియా సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…