పటాన్చెరు,,మనవార్తలు ప్రతినిధి :
నియోజకవర్గం లోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని హజ్రత్ సయ్యద్ మురాద్ అలీషా దర్గా, హజ్రత్ సయ్యద్ నిజాముద్దీన్ షా దర్గా, చోటా మసీద్ ప్రాంగణాల్లో 4 లక్షల 50 వేల రూపాయల సొంత నిధులతో ఏర్పాటుచేసిన 40 సీసీ కెమెరాలను సోమవారం స్థానిక నాయకులు, మైనార్టీ మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, వీటి ద్వారా అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేయడంతో పాటు నేరాలను నియంత్రించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లాలూ నాయక్, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, ముస్లిం మత పెద్దలు లియాకత్ అలీ, వాజిద్ అలీ, అజ్మత్, ఇక్బాల్, మోయిన్, అతీక్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…