మన వార్తలు , అమీన్పూర్
గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మండల పరిధిలోని జానకంపేట, వడక్ పల్లి, దాయర, బొమ్మన్ కుంట, గండిగూడెం గ్రామాల్లో రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరత ఓవర్హెడ్ ట్యాంకులు, పైపులైన్లు, మహిళా మండలి భవనాలను జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, స్థానిక ప్రజా ప్రతినిధులు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలని సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకాన్ని ప్రవేశపెట్టి ఇంటింటికి రక్షిత మంచి నీరు అందిస్తున్నారని అన్నారు.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సరఫరా చేస్తున్న రక్షిత మంచినీరు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ప్రణాళికలు రూపొందిస్తూ ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు లలిత మల్లేష్, భాస్కర్ గౌడ్, కృష్ణ, మల్లేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…