Telangana

చదువుల తల్లికి అండగా ఎమ్మెల్యే జిఎంఆర్

ఉన్నత విద్య కోసం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం

బాసర ట్రిపుల్ఐటీలో చేరనున్న విద్యార్థిని హర్షినికి ఉన్నత చదువులకు భరోసా

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదన్న సంకల్పంతో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఉన్నత విద్యను కొనసాగించే అవకాశాన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా కోల్పోయే పరిస్థితిలో ఉన్న ఓ నిరుపేద విద్యార్థినికి రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి ఆమె విద్యా భవిష్యత్తుకు అండగా నిలిచారు.తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థిని హర్షిని, 574 మార్కులతో ప్రతిష్ఠాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో ఫీజులు చెల్లించడం సాధ్యం కాక, ఉన్నత విద్యపై ఆశలు సన్నగిల్లాయి.ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే విద్యార్థినిని, ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి ధైర్యం చెప్పడంతో పాటు, బాసర ట్రిపుల్ఐటీలో ఆరు సంవత్సరాల విద్యాభ్యాసానికి అవసరమైన ఫీజుల నిమిత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన విద్యార్థులు కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో హర్షిని ఉన్నత విద్యాభ్యాసానికి అండగా నిలిచామని తెలిపారు. భవిష్యత్తులోను సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే అందించిన సహాయానికి విద్యార్థిని హర్షిని, ఆమె కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

admin

Recent Posts

బస్తీల్లో ప్రజలతో మమేకమైన సంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్‌ఆర్‌కే ఫౌండేషన్ చైర్మన్ ఆర్‌కే లక్ష్మి

మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఆర్‌సీ పురం 268 డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…

17 hours ago

బోనాల ఉత్సవాలు తెలంగాణ సంస్కృతికి చిహ్నం : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…

18 hours ago

ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని ఆచరించాలి తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి

ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…

18 hours ago

గుంటూరులో హియ్య డైనో మండి రెస్టారెంట్ ను ప్రారంభించిన లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సె

మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు :  గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…

22 hours ago

జూబ్లీహిల్స్‌లోని జిగ్లీ పెట్ కేర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లో ఇంటర్నేషనల్ హ్యాపీ పెట్స్ డే

పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…

23 hours ago

హైద‌రాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో హై జ్యూవెల‌రీ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన సినీన‌టి మంచు ల‌క్ష్మీ

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ :  అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…

23 hours ago