_ఇక్రిశాట్ తరఫున పటాన్ చెరు క్రికెట్ జట్టును ఆడించాలని వినతి
మనవార్తలు ,పటాన్ చెరు:
పటాన్ చెరు నియోజకవర్గాన్ని క్రీడల కేంద్రంగా చేయాలన్న లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఇక్రిసాట్ క్రికెట్ టీం తరపున పటాన్ చెరుక్రికెట్ టీం జట్టు అవకాశం కల్పించాలని స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఇక్రిశాట్ అధికారులను కోరారు. సోమవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ డిప్యూటీ డైరెక్టర్ అరవింద్ కుమార్ తో ఈ అంశంపై చర్చించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో సభ్యత్వం కలిగిన ఇక్రిశాట్ క్రికెట్ జట్టు గత 10 సంవత్సరాలుగా పోటీల్లో పాల్గొనడం లేదని, ఈ అవకాశాన్ని పటాన్ చెరుక్రికెట్ జట్టుకు కల్పించాలని ఆయన కోరారు. పటాన్ చెరు నియోజకవర్గానికి చెందిన ప్రతిభావంతులైన క్రికెట్ క్రీడాకారులను ఇక్రిసాట్ జట్టు తరఫున పోటీలో పాల్గొనే అవకాశం కల్పిస్తే, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై ఇక్రిశాట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…