_దివ్యాంగులకు ద్విచక్ర వాహనాల పంపిణీ
_మంచినీటి పైపులైను నిర్మాణ పనులకు శంకుస్థాపన
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఈనెల 28న పటాన్చెరు పట్టణంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు జిఎంఆర్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగుల కోసం జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో 2 కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన 210 ద్విచక్ర వాహనాలను పంపిణీ చేయడంతో పాటు పటాన్చెరు పోలీస్ స్టేషన్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ వరకు 10 కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…