Districts

నిరుపేదలకు అండగా ఎండిఆర్ ఫౌండేషన్.

–దివ్యాంగుల భ్రతుకు భరోసాకు చేయుతనిచ్చిన విక్రం ముధిరాజ్.

–సంతోషించి ఎండిఆర్ ఫౌండేషన్ ను దీవించిన నిరుపేద తల్లి.

మన వార్తలు ,పటాన్ చెరు:

పేద ప్రజల శ్రేయస్సుకోసం అహర్నిశలు పాటు పడుతుంది ఆ కుటుంభం. అన్నా ఆపద ఉంది అనగానే తక్షణం స్పందించే గుణం, భ్రతుకుదెరువుకు ఆర్ధిక భరోసాకలిగించే నైజం ఆ కుటుంబానిది. పటాన్చెరు నియోజక వర్గంలో నిరుపేదలు ఎవరు వచ్చి తలుపు తట్టినా కాదనకుండా వారికి ధైర్యంగా, అండగా నిలుస్తు ప్రజల ఆదరణ చూరగొంటున్నది ఆ కుటుంబం . అటువంటి మహోన్నతమైన కుటుంబంఎండిఆర్ ఫౌండేషన్, టిఆర్ఎస్ నియోజక వర్గ నాయకులు, పటాన్చెరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులంతా ప్రజలు భాగుండాలని నిత్యం కృషి చేస్తుంటారు. వందల మంది పేద కుటుంభాలకు దారిచూపారు.

పటాన్చెరు పట్టణంలో ఏ నోట విన్న ఆయన పేరు వినిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. కేవలం దేవేందర్ రాజు  కాక వారి కుటుంబ సభ్యులు కూడా నిస్వార్ధంగా పేద ప్రజలకు తోడుగా నిలుస్తుండడంతో ప్రజలంతా చేరువవుతున్నారు.ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న వివిధ సేవలను చూసి ఓ దివ్యాంగుల కుటుంభం ఎండిఆర్ ఫౌండేషన్ ను ఆశ్రయించింది. బ్రతుకుదెరువు ఉపాది కల్పించాలని కోరగా ఆ కుటుంభం చాయ్ దూకాన్ ఏర్పాటు చేసుకుని ఉపాది పొందేందుకు ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా దేవేందర్ రాజు  సోదరుడు విక్రం ముదిరాజ్ ఆ పేద కుటుంభానికి మంగళవారం ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ఆర్ధిక చేయుతనందుకున్న ఆ కుటుంభం కన్నీటి పర్యాంతమైంది. అన్న అని అడగగానే ఉపాది మార్గం చూపించినందుకు అంబేద్కర్ కాలనీ లో ఉండే ఆ నిరుపేద తల్లి సంతోషం వ్యక్తం చేసింది.  కలకాలం ఎండిఆర్ ఫౌండేషన్, వ్యవస్తాపకులు, సభ్యులు వర్ధిల్లాలని ఆశీర్వదించింది.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

14 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

14 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

14 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

14 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

14 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

3 days ago