–దివ్యాంగుల భ్రతుకు భరోసాకు చేయుతనిచ్చిన విక్రం ముధిరాజ్.
–సంతోషించి ఎండిఆర్ ఫౌండేషన్ ను దీవించిన నిరుపేద తల్లి.
మన వార్తలు ,పటాన్ చెరు:
పేద ప్రజల శ్రేయస్సుకోసం అహర్నిశలు పాటు పడుతుంది ఆ కుటుంభం. అన్నా ఆపద ఉంది అనగానే తక్షణం స్పందించే గుణం, భ్రతుకుదెరువుకు ఆర్ధిక భరోసాకలిగించే నైజం ఆ కుటుంబానిది. పటాన్చెరు నియోజక వర్గంలో నిరుపేదలు ఎవరు వచ్చి తలుపు తట్టినా కాదనకుండా వారికి ధైర్యంగా, అండగా నిలుస్తు ప్రజల ఆదరణ చూరగొంటున్నది ఆ కుటుంబం . అటువంటి మహోన్నతమైన కుటుంబంఎండిఆర్ ఫౌండేషన్, టిఆర్ఎస్ నియోజక వర్గ నాయకులు, పటాన్చెరు మాజీ సర్పంచ్ మాదిరి దేవేందర్ రాజు ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులంతా ప్రజలు భాగుండాలని నిత్యం కృషి చేస్తుంటారు. వందల మంది పేద కుటుంభాలకు దారిచూపారు.
పటాన్చెరు పట్టణంలో ఏ నోట విన్న ఆయన పేరు వినిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. కేవలం దేవేందర్ రాజు కాక వారి కుటుంబ సభ్యులు కూడా నిస్వార్ధంగా పేద ప్రజలకు తోడుగా నిలుస్తుండడంతో ప్రజలంతా చేరువవుతున్నారు.ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న వివిధ సేవలను చూసి ఓ దివ్యాంగుల కుటుంభం ఎండిఆర్ ఫౌండేషన్ ను ఆశ్రయించింది. బ్రతుకుదెరువు ఉపాది కల్పించాలని కోరగా ఆ కుటుంభం చాయ్ దూకాన్ ఏర్పాటు చేసుకుని ఉపాది పొందేందుకు ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా దేవేందర్ రాజు సోదరుడు విక్రం ముదిరాజ్ ఆ పేద కుటుంభానికి మంగళవారం ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ఆర్ధిక చేయుతనందుకున్న ఆ కుటుంభం కన్నీటి పర్యాంతమైంది. అన్న అని అడగగానే ఉపాది మార్గం చూపించినందుకు అంబేద్కర్ కాలనీ లో ఉండే ఆ నిరుపేద తల్లి సంతోషం వ్యక్తం చేసింది. కలకాలం ఎండిఆర్ ఫౌండేషన్, వ్యవస్తాపకులు, సభ్యులు వర్ధిల్లాలని ఆశీర్వదించింది.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…