Districts

జానపద పాటల సీడీ ఆవిష్కరించిన ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రాజు

_ప్రతి మనిషిలో ఉత్తేజాన్ని నింపే శక్తి జానపదం..

–జానపద కళలు ప్రజల గుండె చప్పుడు

అమ్మ లాలి పాట బిడ్డ ఆకలిని మరిపించడంలో జోల పాట చక్కటి నిద్రనందించే శక్తి జానపద పాటకుంది. మాట నుండి పాట ఉద్భవిస్తే అదే జానపదం. అటువంటి జానపద కళాసంపదను ప్రతి ఒక్కరం కాపాడుకోవాలని పటాన్చెరు ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్, టిఆర్ఎస్ నాయకులు దేవేందర్ రాజు గారు అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో మా ఊరి జానపదం వారు నిర్మించిన మనిషి జీవన విధానం అనే జానపద పాట సిడీని ఆయన ఆవిష్కరించారు. అనంతరం యూ ట్యూబ్ ప్రసార మాద్యమంలో పాటను ప్రారంభించారు.

ఈ సందర్బంగా  ఎం.డి.ఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు మాట్లాడుతూ ప్రతి మనిషిలో ఉత్తేజ శక్తిని నింపే మహా శక్తి జానపద కళకు ఉందని అటువంటి జాన పద కళలు మన తెలంగాణ ప్రజల గుండె చప్పుడని అన్నారు. జానపద కళా సంపదను కాపాడే విధంగా రానున్న తరాలు గుర్తుంచుకే విధంగా పాటలను విడుదల చేస్తున్నందుకు మన ఊరు జానపదం టీంను అభినందించారు. అంతే కాకుండా ఈ పాటను చిత్రీకరించడానికి సూచనలు సలహాలు చేసిన రాఘవరెడ్డి టీవీ9 కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మన ఊరి జానపదం ప్రొడ్యూసర్ కుమార్, అజయ్, దర్శకుడు మహావీర్ ఆరుద్ర, కెమెరామెన్ వినయ్ కుమార్ మన్నే, ఎండిఆర్ మధు, ప్రణీత్, వినయ్ గౌడ్, మీడియా సోదరులు నరేష్, నర్సింమ, చారి, శివ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

15 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

17 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

3 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

3 days ago