– రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థులకు బీఎస్సీ విద్యార్థుల ఉద్బోధ
మనవార్తలు,పటాన్ చెరు:
పాఠశాల విద్యార్థులు ఆంగ్లంతో పాటు గణిత శాస్త్రంపై కూడా పట్టు సాధిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు అన్నారు . రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు , వారి ఖాళీ సమయంలో వారానికి రెండు రోజులు ఆంగ్లం , గణితశాస్త్రాలను గీతం బీఎస్సీ విద్యార్థులు బోధిస్తున్నట్టు అధ్యాపక సమన్వయకర్త పి . నరసింహ స్వామి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు . కోవిడ్ లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూతపడడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడిందని , మరీ ముఖ్యంగా ఆంగ్లం , గణితాలపై ఆ ప్రభావం ఉందన్నారు . ఆ లోటును కొంతవరకైనా పూడ్చే లక్ష్యంతో గీతం సెన్స్డ్ విద్యార్థులు ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్టు ఆయన తెలిపారు . ఆంగ్లంతో పాటు ప్రాథమిక గణిత నెపుణ్యాలను బోధించే ఆలోచనతో బీఎస్సీ విద్యార్థులు ముందుకొచ్చారన్నారు .
తమను ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థి ఎంతో ఆప్యాయంగా స్వాగతించారని , తాము బోధిస్తున్నంతసేపూ వారు ఉత్సుకతతో విన్నట్టు బీఎస్సీ చివరి ఏడాది విద్యార్థుల శ్రీపాల్ సింగ్ రాథోడ్ అభిప్రాయపడినట్టు ఆయన తెలిపారు . అతనితో పాటు ఎ.సూర్యవంశీ , డి.అక్షయ్ , బి . ధనుష్యరెడ్డి , కె . జాహ్నవి , వి . అభిజిత్ రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు . పాఠశాల హెడ్మాస్టర్ , ఇతర అధ్యాపకులు కూడా తమ విద్యార్థులను స్వాగతించి , తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు డాక్టర్ స్వామి ఆ ప్రకటనలో పేర్కొన్నారు
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…