– రుద్రారం ఉన్నత పాఠశాల విద్యార్థులకు బీఎస్సీ విద్యార్థుల ఉద్బోధ
మనవార్తలు,పటాన్ చెరు:
పాఠశాల విద్యార్థులు ఆంగ్లంతో పాటు గణిత శాస్త్రంపై కూడా పట్టు సాధిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించవచ్చని గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ విద్యార్థులు అన్నారు . రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు , వారి ఖాళీ సమయంలో వారానికి రెండు రోజులు ఆంగ్లం , గణితశాస్త్రాలను గీతం బీఎస్సీ విద్యార్థులు బోధిస్తున్నట్టు అధ్యాపక సమన్వయకర్త పి . నరసింహ స్వామి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు . కోవిడ్ లాక్డౌన్ సమయంలో పాఠశాలలు మూతపడడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం పడిందని , మరీ ముఖ్యంగా ఆంగ్లం , గణితాలపై ఆ ప్రభావం ఉందన్నారు . ఆ లోటును కొంతవరకైనా పూడ్చే లక్ష్యంతో గీతం సెన్స్డ్ విద్యార్థులు ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్టు ఆయన తెలిపారు . ఆంగ్లంతో పాటు ప్రాథమిక గణిత నెపుణ్యాలను బోధించే ఆలోచనతో బీఎస్సీ విద్యార్థులు ముందుకొచ్చారన్నారు .
తమను ప్రతి ఒక్క పాఠశాల విద్యార్థి ఎంతో ఆప్యాయంగా స్వాగతించారని , తాము బోధిస్తున్నంతసేపూ వారు ఉత్సుకతతో విన్నట్టు బీఎస్సీ చివరి ఏడాది విద్యార్థుల శ్రీపాల్ సింగ్ రాథోడ్ అభిప్రాయపడినట్టు ఆయన తెలిపారు . అతనితో పాటు ఎ.సూర్యవంశీ , డి.అక్షయ్ , బి . ధనుష్యరెడ్డి , కె . జాహ్నవి , వి . అభిజిత్ రెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు . పాఠశాల హెడ్మాస్టర్ , ఇతర అధ్యాపకులు కూడా తమ విద్యార్థులను స్వాగతించి , తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు డాక్టర్ స్వామి ఆ ప్రకటనలో పేర్కొన్నారు
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…