మాస్కే శ్రీరామ రక్ష….
-డాక్టర్ జీవీఎస్ రావు
హైదరాబాద్ సిి :
భౌతిక దూరం పాటించడంతో పాటు… మాస్క్ ధరించడంతోనే కరోనా గోలుసును తెంపవచ్చని డాక్టర్ రావూస్ ఈఎన్టీ ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు .
హైదరాబాద్ ఎంజీబీఎస్, కాచీగూడ రైల్వే స్టేషన్ , కేపీహెచ్బీ బస్టాండ్లో డాక్టర్ రావూస్ ఈఎన్టీ ఆసుపత్రి ,హైదరాబాద్ ఈఎన్టీ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా వలస కూలీలకు, ప్రయాణీకులకు ఉచితంగా మాస్కులు , వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాల పంపిణీ చేశారు. 18 ఏళ్ళ నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ,కోవిద్ వచ్చినా త్వరగా కోలుకుంటారని చెప్పారు. కరోనా నుంచి రక్షణ కోసం మాస్క్లు ,గ్లౌజ్లు, శానిటైజర్లు వాడాలని పిలుపునిచ్చారు.
కోవిద్ 19 అనేది శ్వాసకోస వ్యాధి అని … దగ్గినప్పుడు ,తుమ్మినప్పుడు ,తుంపర్ల ద్వారా ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తుందని డాక్టర్ జీవీఎస్ రావు అన్నారు.ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడం ద్వారానే కోవిద్ వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చన్నారు .ఇలా ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా మాస్క్ సాయం చేస్తే .. కొంత మంది పేదలైనా కరోనా బారిన పడకుండా కాపాడుకోగలుగుతామన్నారు. భాగ్యనగరంలో పది వారాల పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉచితంగా లక్ష మాస్కులు, వాటర్ బాటిల్స్, ఆహార పదార్థాలను అందిస్తున్నట్లు డాక్టర్ రావ్ తెలిపారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…