పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
వడ్డెర సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మంజల దస్తగిరిని నియమిస్తూ జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్ తెలిపారు. హైదరాబాదులోని అత్తాపూర్ సంఘం కార్యాలయంలో వడ్డే సంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మంజల దస్తగిరిని నియమిస్తూ జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్ గారి చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం మంజల దస్తగిరి మాట్లాడుతూ నాపై నమ్మకంవుంచి సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించిన పెద్దలందకి కృతజ్ఞతలు తెలిపారు. వడ్డెర కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ,కాంట్రాక్టులో 20 శాతం పనులు కేటాయించాలని, వడ్డెరలు రాజకీయాల్లోనూ ఎదగాలని, మన హక్కుల సాధనకై డిమాండ్లకు కృషి చేస్తానని , జిల్లాల్లో పర్యటనలు జరిపి కులస్తుల జీవన విధానంపై అధ్యయనం చేస్తానని తెలిపారు, వడ్డెర కులస్థులను ఎస్టీజాబితాలో చేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలిపారు .ఈ కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం ప్రధాన కార్యదర్శి కుంచాల ఏడుకొండలు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పల్లెపు మొగలి, జాతీయ ఉపాధ్యక్షులు జరపటి ఈశ్వర్, రాష్ట్ర యూత్ అధ్యక్షులు పల్లెపు శివకుమార్,మంజలి యాదగిరి , మంజలి హనుమంతు ,స్వామి ,ఎల్లేష్ ,నాగేష్ ,హాభీరామ్ ,వీరేష్ ,భీమయ్య ,తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…