politics

మన ఊరు-మన బడి..విద్యారంగంలో నవ శకానికి నాంది_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఇంద్రేశం, ఇస్నాపూర్, లకడారంలలో

_మన ఊరు మన బడి పథకం ప్రారంభం

_కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు

మనవార్తలు,పటాన్ చెరు:

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకం విద్యావ్యవస్థలో నవ శకానికి నాంది పలుకుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, లకడారం గ్రామాల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మన ఊరు మన బడి పథకం ద్వారా 58 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో మూడు దశల్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు మెరుగు పరచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు.

ప్రధానంగా నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్థులు, సిబ్బందికి సరిపడే ఫర్నిచర్‌, పాఠశాల మొత్తం పెయింటింగ్‌ , గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహరీ గోడలు, కిచెన్‌ షెడ్లు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌ రూంలు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్స్‌, డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అవినీతికి తావులేకుండా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పాఠశాల నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో పారదర్శకంగా నిధులు ఖర్చు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం అందించే నిధులతో పాటు నియోజకవర్గంలోని వివిధ సంస్థలు, పరిశ్రమలు నుండి సి ఎస్ ఆర్ ద్వారా నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు సువర్ణ మాణిక్ రెడ్డి, గడ్డం బాలమణి శ్రీశైలం, దండు నర్సింలు, మండల విద్యాధికారి రాథోడ్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇంజనీర్ సత్యనారాయణ, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

6 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

6 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

6 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

6 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

6 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago