మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో గల మాదాపూర్ డివిజన్ లోని మాతృశ్రీ నగర్ టెంపుల్ పార్కులో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇంచార్జి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత నమోదు నిర్వహించారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ మరియు సభ్యత్వ నమోదు ఇంచార్జ్ రాధాకృష్ణ యాదవ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులకు బిజెపి పార్టీ యొక్క గొప్పతనాన్ని నరేంద్ర మోడీ నాయకత్వ ప్రతిభను తన మాటల్లో వివరించారు. ఈ ప్రాంతం నుంచి ఖచ్చితంగా 2000 కు పైగా సభ్యత్వాలు నమోదు చేయించగలిగే అవకాశాలు ఉన్నాయని, దానికి అనుగుణంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి బిజెపి పార్టీని బలోపేతం చేసే విషయంలో స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలు తమ వంతు బాధ్యతను నిర్వర్తించే విధంగా కృషి చేయాలని కోరారు. అనంతరం రాధాకృష్ణ యాదవ్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ, బిజెపి స్థానిక నాయకులలో,పార్టీ శ్రేణులలో,బిజెపి కార్యకర్తలలో, ఉత్సాహాన్ని నింపే విధంగా వారితో కలిసి డోర్ టు డోర్ క్యాంపెనింగ్ ద్వారా కాలనీ వాసులను, స్థానికులను కలుస్తూ పలు సభ్యత్వాలు నమోదు చేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారనీ నాయకులు ప్రశoశించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిషన్ నాయకులు సూర్ణ శ్రీశైలం కురుమ, రంజిత్ కుమార్, మహేష్ రవ్వ, సత్యనారాయణ, అల్లాడి ప్రవీణ్, ముఖేష్, వంశీ, నాగేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…