పటాన్ చెరు:
మట్టి వినాయకులను పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పటాన్ చెరు మాజీ సర్పంచ్, టిఆర్ఎస్ నాయకులు, ఎండిఆర్ పౌండేషన్ వ్యవస్థాపకులు దేవేందర్ రాజు పిలుపునిచ్చారు. వినాయక చవితిని పురస్కరించుకుని పటాన్ చెరు పట్టణంలో నూతన మార్కెట్ సమీపంలో గురువారం మట్టి వినాయకులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెమికల్ రంగులతో తయారుచేసిన వినాయకుల వల్ల నీరు కలుషితం అవుతుందన్నారు.
ఇది పర్యావరణానికి కూడా ప్రమాదం అన్నారు. పర్యావరణ సమతుల్యత ఉంటేనే అన్ని రకాల జీవుల మనుగడ కొనసాగుతోందన్నారు. నేడు యాంత్రిక ప్రపంచంలో ఇప్పటికే కాలుష్యం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇలాంటి తరుణంలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కరోనా ప్రభావిత సమయం కాబట్టి వినాయక మండపాల వద్ద ఎక్కువమంది గుమి కూడవద్దని అన్నారు.
కరోనా జాగ్రత్తలతో ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎండిఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు, మాజీ వార్డు మెంబర్ అనంతయ్య, పోచారం కృష్ణ, ఎండిఆర్ యువసేన సభ్యులు ప్రవీణ్, ప్రణీత్, చోటు, శ్రీకాంత్, నర్సింగ్, వేణు, వినయ్, జాన్సన్, రాజశేఖర్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…