Districts

కోటి 18 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి

_నాలుగు లక్షల రూపాయల సొంత నిధులచే ట్రాక్టర్ డోజర్ ల పంపిణీ

మనవార్తలు ,అమీన్పూర్

నియోజకవర్గపరిధి లోని గ్రామాలకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమిన్ పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్, వడక్ పల్లీ గ్రామాలలో కోటి 18 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పరిధిలోని ఐదు గ్రామ పంచాయతీల ట్రాక్టర్లకు నాలుగు లక్షల రూపాయల సొంత నిధుల చే డోజర్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీని మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిధుల కొరత ఉన్నప్పటికిని సి ఎస్ ఆర్ నిధుల సహకారంతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. సుల్తాన్ పూర్ గ్రామంలో సి సి రోడ్డు నిర్మాణానికి కోటి నాలుగు లక్షల రూపాయలు అందించిన టి ఎస్ ఐ ఐ సి కి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులతో పాటు జిల్లా పరిషత్తు నుండి మంజూరైన నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు.

అనంతరం పటేల్ గూడా గ్రామంలో నిర్మిస్తున్న దుర్గమ్మ దేవాలయం స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, ఎంపీడీవో మల్లేశ్వర్, సర్పంచులు లలిత మల్లేష్, మల్లేష్, రవి, భాస్కర్ గౌడ్, పాండు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు, శ్రీకాంత్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago