Telangana

పాఠ‌శాల‌లో కనీస మౌళిక వ‌స‌తులు క‌రువు – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు;

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మౌళిక స‌దుపాయాలు లేక విద్యార్థులు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని ముత్తంగి ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ప‌రిశీలించారు. విద్యార్థుల‌కు పుస్త‌కాలు ఇవ్వ‌కుండానే పాఠాలు చెబుతున్నార‌ని పేరుకే మ‌న మన ఊరు, మన బడి కార్యక్రమం అంటూ ప్ర‌భుత్వం గొప్ప‌లు చెబుతుంద‌ని విమ‌ర్శించారు. పాలకుల మాటలకు క్షేత్ర స్థాయిలో పనులకు పొంతన లేదని గ‌డీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు .జిల్లాలోని గ్రామీణ పాఠ‌శాల భ‌వ‌నాలు శిధిలావస్థలో ఉన్నాయ‌ని గోడ‌లు , పైక‌ప్పులు కూలేస్థితిలో ఉన్నాయ‌నే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయ‌న్నారు. పాఠ‌శాల‌లో క‌నీసం తాగునీరు అంద‌డంలేద‌న్నారు .సైన్స్ ల్యాబ్, కంప్యూట‌ర్ ల్యాబ్ ల‌ను త‌ర‌గ‌తి గదులుగా వినియోగిస్తున్నార‌ని తెలిపారు.

పాఠశాలలో నిరుపయోగంగా పడిఉన్న కంప్యూట‌ర్ ల్యాబ్

మన ఊరు మన బడి పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి పాఠశాలల రూపు రేఖలు మారుస్తాం అన్న ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం అయిందని శ్రీకాంత్ గౌడ్ ఎద్దేవా చేసారు. పాఠశాల గోడలు శిధిలావస్థలో ఉన్నాయని, కనీసం మరుగుదొడ్లు కుడా సక్రమంగా లేకపోవడం, త్రాగు నీరు లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. పాఠశాలలు ప్రారంభం అయి మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకూ పుస్తకాలు లేకుండానే విద్యార్థులకు పాఠాలు చేస్తున్నారని, దీనిని బట్టి విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందని,డిజిటల్ పాఠాలు కేవలం డిజిటల్ ప్రకటనలకే పరిమితం అయ్యాయాని తెలిపారు . పాఠశాలలో తరగతి గదులు లేక ఒకే గదిలో 3,4 తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించడంపై స్దానిక శాసన సభ్యులు గుడెం మహిపాల్ రెడ్డి పై మండి పడ్డారు.


ఉన్నత పాఠశాలలో నూతన భవన నిర్మాణం కోసం ముడు సంవత్సరాలుగా పనులు పూర్తి కాకపోవడంపై ఆయ‌న మండిప‌డ్డారు . సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పాఠ‌శాల‌ల‌ను బాగు చేస్తామ‌ని చెప్పి  నిధులు ప‌క్కదారి ప‌ట్టిస్తున్నార‌ని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, శాసన సభ్యులు స్పందించి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ప‌రిష్క‌రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవెందర్ గౌడ్, నిజామోద్దీన్, కిశోర్ రెడ్డి, పున్యవతి, ధన్ రాజ్, షకీల్, సాయి,దీపక్, నరేంద‌ర్, రాజు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago