Telangana

చట్టాలపై అవగాహన తప్పనిసరి

గీతం విద్యార్థులకు కేళర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రాజు నారాయణస్వామి సూచన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

సైబర్ సెక్యూరిటీని పాఠ్యాంశంగా అభ్యసించే విద్యార్థులందరికీ ఐటీ చట్టం 2000పై అవగాహన తప్పనిసరి అని కీరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, కేరళ అవినీతి వ్యతిరేక క్రూసే డర్ గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ రాజు నారాయణ స్వామి, ఐఏఎస్ అన్నారు. ‘కృత్రిము మేథ యుగంలో సైబర్ సెక్యూరిటీ’ అనే అంశంపై శుక్రవారం ఆయన బీ.టెక్ సైబర్ సెక్యూరిటీ విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారంతా ఐటీ చట్టం – 2000తో అనుసంధానం కలిగిన న్యాయ చట్టాలను అధ్యయనం చేయడంతో పాటు సైబర్ భద్రతకు సంబంధించి, ఆ చట్టంలో పొందుపరిచిన చట్టపరమైన నిబంధనలను అర్ధం చేసుకోవాలని సూచించారు. సైబర్ భద్రతకు క్వాంటం కంప్యూటింగ్ వల్ల కలిగే ముఖ్యమైన ముప్పు గురించి ఆయన వివరించారు. సైబర్ కిల్ చైన్ , ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ అప్రోచ్, ఆర్టిఫిషియల్-డీప్ న్యూరల్ నెట్ వర్క్ ల యొక్క చిక్కులు వంటి కీలక అంశాలను చర్పించారు.

క్లౌడ్ఫీకేషన్ సమస్యలు, మానవులు- యంత్రాల మధ్య పోటీతో సహా సైబర్ సెక్యూరిటీ రంగంలో మనదేశం ఎదుర్కొంటున్న ప్రత్యేకమైన సవాళ్లను కూడా డాక్టర్ స్వామి ప్రస్తావించారు.పాలనలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి సంబంధించిన ఒక ప్రశ్నకు సమాధానంగా, ‘అవినీతిని తగ్గించడానికి వ్యవస్థను మెరుగుపరచడమే ఉత్తము మార్గం’ అని డాక్టర్ స్వామి పేర్కొన్నారు. పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలకమైన నేరుగా లబ్దిదార్ల అకౌంట్లలో జమ (డీబీటీ), ఈ-పాలన, ఎం-పాలన వంటి ఉత్తమ విధానాల వల్ల ఆయా ధ్రువీకరణ పత్రాలను నేరుగా ఆన్ లైన్ లో నిర్ధారిత గడువులోగా అందుకోగలుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఉటంకించారు.

అంతకు మునుపు, డాక్టర్ స్వామి తన వినూత్నమైన, చురుకైన పాలనా విధానానికి పేర్గాంచిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో, గీతం తొలి ఏడాది బీ.టెక్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.తొలుత, ప్రొఫెసర్ టి.త్రినాథరావు అతిథిని పరిచయం చేయడంతో కార్యక్రమం ప్రారంభం కాగా, సీఎస్ఈ. విభాగాధిపతి ప్రొఫెసర్ షేక్ మహబూబ్ బాషా వందన సమర్పణతో ముగిసింది. పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమాలలో పాల్గొని, తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

admin

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

2 days ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

3 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

3 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

4 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

4 days ago