Telangana

మైత్రి మైదానం లో హోరా హోరీగా ముగిసిన కాంతయ్య మెమోరియల్ ఉమెన్స్ హాకీ టోర్నమెంట్

_విజేతగా నిలిచిన చంద్ర కాంతయ్య అకాడమీ సంగారెడ్డి జట్టు

_రన్నరప్ గా నిలిచిన జింఖానా బి సికింద్రాబాద్ జట్టు

_విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ,పటాన్ చెరు:

పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సౌజన్యంతో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న చంద్రకాంతయ్య మెమోరియల్ ఉమెన్స్ హాకీ 5A సైడ్ టోర్నమెంట్ సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ముగిసింది. మైత్రి మైదానం ప్రారంభ రోజున మంత్రి హరీష్ రావు చేతులమీదుగా హాకీ టోర్నమెంట్ ప్రారంభం అయిన సంగతి అందరికీ తెలిసిందే. వివిధ జిల్లాల నుండి 10 జట్లు టోర్నమెంట్లో పాల్గొన్నాయి. చివరి రోజైన సోమవారం సాయంత్రం చంద్రకాంత అకాడమీ సంగారెడ్డి జట్టు -జింఖానా బి సికింద్రాబాద్ జట్ల మధ్య తుది పోరు జరిగింది. హోరాహోరీగా సాగిన పోటీలో చంద్రకాంతయ్య అకాడమీ జట్టు ఘన విజయం సాధించింది.

అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని 7 కోట్ల 25 లక్షల రూపాయలతో పూర్తిస్థాయిలో ఆధునీకరించడం తో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. స్వతహాగా క్రీడాకారుడు అయిన తాను నియోజకవర్గాన్ని క్రీడలకు కేంద్రంగా చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే మైత్రి మైదానాన్ని ఆధునీకరించడంతో పాటు, ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 3 మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని తెలిపారు.

 

ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులు చేయడంలో చూపించే శ్రద్ధ క్రీడలపై ఆసక్తి పెంపొందించడం పై కనబరచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలపై మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం, ఏకాగ్రత లభిస్తోందని అన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని అన్నారు.మూడు రోజుల పాటు హాకీ టోర్నమెంట్ను దిగ్విజయవంతంగా నిర్వహించినందుకు నిర్వాహకులను అభినందించారు. అనంతరం ప్రథమ విజేతకు 15 వేల రూపాయలు, రన్నరప్ కు 10 వేల రూపాయలు, తృతీయ స్థానంలో నిలిచిన వరంగల్ చెట్టుకు ఐదు వేల రూపాయల క్యాష్ ప్రైజ్ అందించడంతోపాటు ట్రోఫీలను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పీటీసీ లు సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సిఐ లు వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, విజయ్ భాస్కర్ రెడ్డి, పరమేష్ యాదవ్, షేక్ హుస్సేన్, హాకీ అసోసియేషన్ ప్రతినిధులు కృష్ణ, రఘునందన్ రెడ్డి, చంద్ర శేకర్, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హన్మంత్ రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago