పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఏసుక్రీస్తు బోధనలు సదా ఆచరణీయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో.. నియోజకవర్గ పరిధిలోని 350 చర్చిలకు సొంత నిధులతో కేకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతికి, ప్రేమకు క్రిస్మస్ పండుగ ప్రతీక అని అన్నారు. దశాబ్ద కాలంగా నియోజకవర్గ పరిధిలోని ప్రతి చర్చికి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సొంత నిధులతో నూతన చర్చిల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందించడంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో క్రిస్టియన్లకు తగు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ రావు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అతిక్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…