Telangana

వ్యర్థాల నిర్వహణపై అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : 

వ్యర్థాల నిర్వహణ – వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, ఐపీఎల్ అంతర్జాతీయ ఫోరమ్ 2024 పై 14వ అంతర్జాతీయ సదస్సును గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులతో చర్చలు, విజ్ఞాన భాగస్వాన్యూన్ని సులభతరం చేయడానికి ఈ యేడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1న తేదీ వరకు ఈ సద స్సును హైబ్రీడ్ విధానంలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.ఈ సమావేశంలో వ్యర్థాల నిర్వహణ, వృత్తాకార ఆర్ధిక వ్యవస్థకు సంబంధించిన అనేక ఇతివృత్తాలు, వ్యర్థాలు, విధానాలు, నిబంధనలు, ఇంజనీరింగ్, సాంకేతికత, సామాజిక, వ్యాపారం, పరిశ్రమలు, వ్యవస్థాపకత వంటివి ఉంటాయని తెలియజేశారు. సదస్సులో భాగంగా కీలకోపన్యాసాలు, ప్లినరీ చర్చలు, ప్రత్యేక సాంకేతిక కార్యక్రమాలు, ప్యానెల్ చర్చలు వంటివెన్నో ఉంటాయన్నారు.విద్యారంగ ప్రతినిధులు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలలో పనిచేసేవారు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు, ఆరోగ్య పరిరక్షణ సంస్థలు, ఇతర ఆసక్తిగల వారు సెప్టెంబర్ 15లోపు 35-0005 jponswm.ce@gmail.com/jconswmce@gitam.edu అని వారు సూచించారు. నిర్దిష్ట ప్రవేశ రుసుము చెల్లించి వ్యక్తిగతంగా లేదా ఆన్ లైన లోసదస్సుకు హాజరు కావచ్చని, అలాగే కాన్ఫరెన్స్ ఈ-ప్రొసీడింగ్ లను కూడా ప్రచురిస్తామన్నారు .ఈ సదస్సుతో పాటు, స్కూల్ కాంగ్రెస్, హ్యాకథాన్, ఇండస్ట్రీ ఎక్స్ పో , ప్రీ-కాన్ఫరెన్స్ డాక్టోరల్ వర్క్ షాప్ ను నవంబర్ 27న నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం సదస్సు చెర్మన్ ప్రొఫెసర్ సాధన కె.ఘోష్ 98300 44464, నిర్వాహకుడు డాక్టర్ వైఎల్ . పీ. థోరన్ 888 678 5076లను సంప్రదించాలని సూచించారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

10 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

10 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

11 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

11 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

11 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago