పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
దేశంలోని 28 రాష్ట్రాల ప్రజలు పటాన్చెరు నియోజకవర్గంలో జీవనం సాగిస్తున్నారని, కులమత బేధాలు లేకుండా అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు పరిధిలోని శ్రీకాకుళం సంక్షేమ సంఘం కోసం గతంలోనే సొంత నిధులతో 500 గజాల స్థలం కొనుగోలు చేసి అందించడం జరిగిందని, రెండు రోజుల్లో భవన నిర్మాణ పనులను సైతం ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన శ్రీకాకుళం సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీధర్ చారి, సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు సాయి తేజ, అధ్యక్షులు యోగేష్, కూర్మ నాయకులు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
500 మంది విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇటీవల విడుదలైన…
దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపించండి మంత్రి వివేక్ కు వినతి పత్రం ఇచ్చిన ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు మనవార్తలు ప్రతినిధి…
15 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన పటాన్చెరు ఎం ఎల్ ఎస్ పాయింట్ వే బ్రిడ్జి ప్రారంభం…
మొక్కలు నాటిన గీతం ఉన్నతాధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: దేశవ్యాప్త ‘తల్లి పేరిట ఒక…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: క్వాంటం టెక్నాలజీల కోసం షట్కోణ బోరాన్ నైట్రైడ్ లో రుణాత్మక ఆవేశం గల ఏక…
తెల్లాపూర్ ‘జి. ఎల్లయ్య ఎన్క్లేవ్’లో ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ…