Hyderabad

అంతరిక్ష పరిశోధనల్లో భారత్ శాసించే స్థాయికి చేరుకుంటుంది – రిటైడ్ సైoటిస్ట్ శివప్రసాద్

 మన వార్తలు,శేరిలింగంపల్లి :

రానున్న కొన్ని సంవత్సరాల్లో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ మిగతా దేశాలను శాసించే స్థాయికి చేరుకుంటుందని ఇస్రో విశ్రాంత శాస్త్ర వేత్త యెల్లా శివప్రసాద్ అన్నారు. బి.హెచ్.ఈ. ఎల్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి పిలుపు మేరకు ఆయన స్కూల్ ను సందర్షించి విద్యార్థులకు, ఉపాద్యాయులకు అంతరిక్ష పరిశోధన ల గురించి వివరించారు. అంతరిక్షంలో జరిగే పరిశోధనలు, రాకెట్ల తయారీ, వాటి ప్రయోగం, ఉపయోగం గురించి వివరించే విదంగా పుస్తకాల్లో పాఠ్యoశoగా చేర్చాలని ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు. పిల్లల్లో చిన్నప్పటి నుండి శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిజ్ఞానం ఉండాలని తెలిపారు. రాకెట్ల తయారీ, ఉపగ్రహల ప్రయోగం గురించి వివరిస్తే వారు భవిశ్యథ్ లో దేశం గర్వించే గొప్ప శాస్త్ర వేత్తలుగా తయారవుతారని పేర్కొన్నారు. త్వరలోనే ప్రపంచంలో అబ్బురపరిచే విధంగా మన పరిశోధనలు ఉంటబోతున్నట్లు తెలిపారు.

సొంతంగా సొంతింటి కల….
త్వరలోనే అంతరిక్షంలో సొంతంగా సొంతింటి కల నెరవేరనుందని, అందుకు భారతీయ శాస్త్ర వేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు ప్రయోగించిన అనేక ఉపగ్రహల్లోనూ, రాకెట్ల లలోను తన సేవాలున్నాయని, ఇపుడు పిల్లల్లో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని నింపేందుకు ఉచితంగా తన అనుభవాలను పంచుకొంటూ వారిలో ఆసక్తిని నింపేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన జ్యోతి విద్యాలయ హై స్కూల్ ఫాదర్ అండ్రూస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Ramesh

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

7 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

9 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago