Telangana

ఆకట్టుకున్న ‘ఎలా ఉన్నారు’ స్కిట్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్లోని మానసికశాస్త్ర (సెక్షాలజీ) విభాగం ఆధ్వర్యంలో “ఎలా ఉన్నారు” (హౌ ఆర్ యూ)) పేరుతో ఆకర్షణీయమైన స్కిట్న ప్రదర్శించారు. కళలు, ప్రదర్శనల విభాగం సహకారంతో నిర్వహించిన ఈ స్కిట్లో మాటలే లేకుండా భావాలను, భావోద్వేగాలను, మానసిక స్థితి, మెదడుపై వాటి ప్రభావాలను చూపేలా సాగింది.అసిస్టెంట్ ప్రొఫెసర్ రమిత్ రమేష్ నూర్గదర్శనంలో ప్రతిభావంతులైన ఎం. సాయిస్పందన, ఐషాని, ఆధ్యా: రాకేష్, యామినీ పద్మప్రియ, గ్రీసు, పవన్ శశాంక్ కశ్యప్, నిర్మా చౌదరి ఈ అపూర్వ ప్రదర్శనను రూపొందించారు.డివెజ్డ్ థియేటర్ అనేది ఒక సహకార ప్రక్రియ. ఇది సమిష్టి ప్రదర్శనను సృష్టిస్తుంది.
భాగస్వాన్యు పద్ధతుల ద్వారా సమిష్టి ప్రయోగాలు, కదలికలను మెరుగుపరచడం ద్వారా ఒకదానికొకటి జోడించబడిన అనుభూతిని సృష్టించి, ప్రేక్షకులు వాటికి సొంత అర్థాన్ని అన్వయించుకునేలా చేస్తుంది.ప్రేమ, దుఖం, నష్టం, పెరుగుదల, మార్పును అంగీకరించడం, విభిన్న వ్యక్తులతో శాంతిని పొందడం, ప్రేక్షకులు కళాకారుల మధ్య సరిహద్దులను చెరిపివేయడమే లక్ష్యంగా ‘ఎలా ఉన్నారు’ ప్రదర్శన సాగి, కళ అనేది జీవితానికి ప్రతిబింబం అని గుర్తుచేసింది.గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, ఆంగ్ల విభాగాధిపతి ప్రొఫెసర్ డీఆర్ చంద్రశేఖర్, సెక్షాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దుర్గేష్ నందినీ, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఈ స్కిలను తిలకించి, ప్రదర్శకులను అభినందించారు.
admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago