WWW.ZEROCO.DE/SUPER100
హైదరాబాద్:
ఐటీ అప్లికేషన్స్ అభివృద్ది చేసేందుకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన జీరో కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ సరికొత్త ఆన్లైన్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చింది . హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని జోరో కోడ్ ఇన్నోవేషన్ సంస్థ ఐఐటీ కర్నూలు, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సహకారంతో సూపర్ 100 పేరుతో కొత్త కోర్సును రూపకల్పన చేసింది.
పది రోజుల కాలవ్యవధిగల ఈ కోర్సు నో కోడ్ టెక్నాలజీ ఫ్లాట్ ఫాం ఆధారంగా రూపొందించినట్లు జీరో కోడ్ ఇన్నోవేషన్స్ సంస్థ ప్రతినిధులు ప్రశాంత్, భరత్లు తెలిపారు .ఇంజనీరింగ్ ,నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు కంప్యూటర్ పై పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కోర్సుకు అర్హులని…ఈ కోర్సు పూర్తయిన వారిలో వంద మందికి తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు .
దీంతో పాటు మరో వంద మందికి ఇంటర్నషిప్ అవకాశం కల్పిస్తామని తెలిపారు . సూపర్ 100 కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికేట్తో పాటు వెబ్సైట్లు, యాప్లు రూపొందించుకుని ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు .ఈ నెల 23 తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని…మే 29 నుంచి జూన్ 8 వ తేదీ వరకు కోర్సును అన్లైన్ ద్వారా అందిస్తామన్నారు . సాఫ్ట్ వేర్ రంగంలో కెరీర్ కొనసాగించాలనే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశమన్నారు.
నాన్ టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ విద్యార్థులు సైతం ప్రొగ్రామర్లుగా తీర్చిదిద్ది ..వారిని డిజిటల్ 2.O విప్లవంలో భాగస్వాములను చేయడమే ఈ కోర్సు ముఖ్య ఉద్దేశమని సంస్థ ప్రతినిధులు తెలిపారు . కోర్సు ఫీజు 7500 రూపాయలుగా నిర్ణయించారు. WWW.ZEROCO.DE/SUPER100 ద్వారా తమ వివరాలను ఎన్రోల్ చేసుకోవాలన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…