Telangana

ప్రజారోగ్యం, పరిశోధనా రంగాలలో అపార అవకాశాలు

గీతం ముఖాముఖిలో ఎమోరీ విశ్వవిద్యాలయ డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సింగ్లా

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజారోగ్యం, పరిశోధనా రంగాలలో ఫార్మసీ విద్యార్థులకు విశ్వవ్యాప్తంగా అపార అవకాశాలు ఉన్నాయని అమెరికాలోని ఎమోరీ విశ్వవిద్యాలయ భారతీయ పరిశోధనా, విద్యా ఆవిష్కరణల డైరెక్టర్ డాక్టర్ నిఖిల్ సింగ్లా అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాధును ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం సందర్శించింది. ఈ సందర్భంగా ఫార్మసీ విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో డాక్టర్ నిఖిల్ పలు అంతర్దృష్టులను పంచుకున్నారు. విద్యార్థుల పరిధిని విస్తృతం చేసేందుకు, వారి విద్యా, వృత్తిపరమైన విషయాలలో అంతర్జాతీయ అవకాశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.ఎమోరీ విశ్వవిద్యాలయంతో సహకారం కోసం ప్రయత్నిస్తున్నామని, రెండు సంస్థలలో విద్యానుభవాలను పెంపొందించే, ఆవిష్కరణలను ప్రోత్సహించే ఉమ్మడి పరిశోధనా కార్యక్రమాలు చేపట్టే వీలుందని ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరణ్ దాస్ పేర్కొన్నారు. ‘మా అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యాలను బలోపేతం చేయడంలో ఈ పరస్పర చర్య ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది’ అని డాక్టర్ దాస్ అన్నారు.ఎమోరీ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఐవోన్ ఫోసీ, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిసాల్ డాక్టర్ కె.శివకుమార్, స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్ ఛార్జి డైరెక్టర్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫార్మసీ అధ్యాపకులు డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ పవన్ కుమార్ దీనిని సమన్వయం చేశారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago