కర్నూల్:
శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున మహా పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్నది. పరమ శివుడి దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచేకాక ఉత్తర, దక్షిణాది యాత్రికులు ఆదివారం సాయంత్రానికి అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. భక్తుల కు అలంకార దర్శనాలు క ల్పించడంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ ఈవోలకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తెల్లవారుజుమున కృష్ణానదిలో పుణ్య స్నానాలు చేసుకుని కృష్ణమ్మకు పసుపు, కుంకుమ సారెలు ఇచ్చి కార్తీక దీపదానాలు చేశారు.
స్నానాల ఘాట్ వద్ద ప్రమాదాలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి తెలిపారు. చిన్నారులపై తల్లిదండ్రులు శ్రద్ధ్ద వహించాలని కోరారు. అదేవిధంగా కార్తీక దీపాలనువెలిగించుకునేందుకు భక్తులకు వీలుగా ఆలయ ఉత్తర మాఢవీధిలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఏఈవో హరిదాసు తెలిపారు. విద్యుద్దీపకాంతులతో అలరారుతున్న ఆలయ శోభను వీక్షిసూ భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులవుతున్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…