పటాన్‌చెరులో ఘనంగా ఆషాఢ బోనాల పలారం బండి ఊరేగింపు

politics Telangana

ఇస్నాపూర్, పటాన్ చెరు లోని పలు పలారం బండి ఉత్సవాలలో పాల్గొన్న

మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు పట్టణంతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆషాఢ మాస బోనాల పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలారం బండి ఊరేగింపు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి నీలం మధు ముదిరాజ్ స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు.మంగళవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ మన్నే రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి వేడుకలకు నీలం మధు ముదిరాజ్, కాట శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పటాన్‌చెరు పట్టణంలో యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గోకుల్ యూత్, గోనెమ్మ బస్తి, జూనియర్ బాయ్స్ యూత్ మరియు వివిధ కాలనీల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండ్ల ఊరేగింపుల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని అన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులను, యూత్ సభ్యులను ఆయన అభినందించారు అనంతరం జిల్లా ఐ ఎన్ టి యు సి అధ్యక్షులు నరసింహ రెడ్డి నివాసంలో తేనీటి విందులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఐఎన్ టియుసి జిల్లా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరసింహ రెడ్డి,  మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, నాయకులు కాసాని వీరేష్, కౌన్సిలర్స్ గోపాల్ రెడ్డి, సంగన్నగారి గోపాల్, దస్తగిరి, సంపత్ రెడ్డి, వెంకటేష్ నాయక్, సందీప్ గౌడ్, నారాయణదాసు, మణికంఠ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, యూత్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *