_విద్యార్థి నాయకుల పదవి బాధ్యతల స్వీకరణ
మనవార్తలు , శేరిలింగంపల్లి :
విద్యార్థులు బాగా చదువుకొని మంచి ఫలితాలు సాధించి దేశానికి సేవ చేయాలని బీహెచ్ఈఎల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి అన్నారు. భెల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యార్థులయ సీబీఎస్ సి హై స్కూల్ లో ఇన్వెస్టి చర్ పేరుతో నిర్వహించిన విద్యార్థి నాయకుల పదవి భాద్యతల స్వీకరణయోత్సవా కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిధిగా విచ్చేసి మాట్లాడుతూ తాము ఎంచుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి స్కూల్ సిబ్బంది చక్కటి ప్రోత్సహాన్ని అందిస్తున్నారని, విద్యార్థులు వృద్ధి లోకి వచ్చి తల్లిదండ్రులకు, స్కూల్ కు మంచిపేరు తీసుకురావాలని సూచించారు. కస్టమ్స్ అండ్ సెంట్రల్ టాక్స్ సూపరింటెండెంట్ శాంతిశ్రీ మాట్లాడుతూ జ్యోతి విద్యాలయకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, దాన్ని నిజం చేస్తూ విలువలతో కూడిన విద్యాబోధన చేస్తున్న అధ్యాపక బృందాన్నీ అభినందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకుని ఆ దిశగా దూసుకుపోవాలని, అందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరీ తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక నృత్యరూపకం ఆహూతులను అలరించింది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం కోసం నవరత్నాలల్లో భాగమైన ఏమరాల్డ్, గార్నెట్, రూబీ, సఫైయర్ గ్రూపులను తయారు చేసి, లీడర్లను, క్యాప్తన్. లను ఎంపిక చేసి వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్, ఫాదర్ ఆంబ్రోస్ బెక్, సీనియర్ డిజిఎం, ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రెటరీ, ఎస్టేట్ ఆఫీసర్ సురణ్ ప్రసాద్, డి జి ఎం లు శశికిరణ్, ఫణిదర్, సివిల్ మేనేజర్ మాయబ్రహ్మం, పి ఈ టి లు బాలు, వేణుగోపాల్, పూర్వ విద్యార్థులు బీచ్ వాలీబాల్ ఇండియన్ టీమ్ క్యాఫ్టన్ కృష్ణoరాజు, బాస్కెట్ బాల్ క్రీడాకారిణి పూర్ణిమ రాఘవేందర్, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…