మనవార్తలు ,పటాన్చెరు:
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి దీక్షలు ,ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.టీఆర్ఎస్ నేతలు చేపట్టిన దీక్షల్లో ఒక్క రైతు లేడని విమర్శించారు. పటాన్ చెరు నియోజకవర్గం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేపట్టిన ధర్నాలో కేవలం గులాబీదళం మాత్రమే ఉందని.రైతులు లేరని గడీల శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో పండించిన పంటను కొనుగోలు చేస్తాము అని చెప్పింది కానీ.కొనుగోలు చేయమని చెప్పలేదన్నారు.వడ్ల కొనుగోలు విషయంలో టీఆరఎస్ ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తుందని బిజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగడీల శ్రీకాంత్ గౌడ్ గడీల శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు.
వడ్ల కొనుగోలు విషయంలో ప్రజలకు,రైతులకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. రైతుల గురించి ధర్నా చేసే ముందు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఏ రకంగా పెంచారు ప్రజలకు తెలియజేయాలన్నారు. రైతులు పంటను అమ్ముకునేందుకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీరు ఏర్పాటు చేసిన మీ సొంత క్రషర్ మైనింగ్ ల వల్ల పంట పండించుకునే వీలు కూడా లేకుండా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు .ఈ విషయంపై గూడెం మహిపాల్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.
బిజెపి నేతలు ధర్నాలకు దిగితే బీజేపీ నేతలను పోలీసులచే గృహనిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ధర్నాలకు దగ్గరుండి బందోబస్తు ఇవ్వడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మధుకర్ రెడ్డి, మరియు ఎస్.ఆర్.కే యువసేన సభ్యులు శకిల్, బండి నర్సింగ్ యాదవ్, కమాలకర్ రెడ్డి, దుర్గా సాయి, మల్క పురం సాయి తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…