బీరంగూడ- కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణలో భాగంగా శ్రీ కృష్ణుడి గుడి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పటాన్చెర శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆయా శాఖల అధికారులతో కలిసి బ్రిడ్జి పనుల పురోగతిని పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో మురుగు నీరంతా ఇళ్లలోకి వస్తుందన్న కాలనీవాసుల ఫిర్యాదు మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కాలనీ లో పర్యటించారు.
మురికినీరు కాలనీ లోకి వెళ్లకుండా అత్యవసరంగా నూతన పైప్లైన్ వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చేయాలని సూచించారు. జాతీయ రహదారి కి అమీన్పూర్ మున్సిపాలిటీ కలిపి కీలకమైన బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, హెచ్ఎండిఎ ఈ ఈ అప్పారావు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…