మనవార్తలు , శేరిలింగంపల్లి :
జి వై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్స్ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శివాలయం దగ్గర, ఇంద్ర హిల్స్, లో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బీజేవైఎం శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్, ఎం రామకృష్ణ ఆధ్వర్యంలో జి వై ఫౌండేషన్ ఫౌండర్ ట్రస్టీ గజ్జల యోగానంద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఇక్కడి ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉంటాయన్నారు. చలితీవ్రత రాష్ట్రవ్యాప్తంగా పెరిగిందని, చలి నుండి రక్షణ కొరకు వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని ఆయన సూచించారు.
పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు బీజేపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తిస్తుందని. విద్యార్థులు చిన్నతనం నుండే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించి, మీ కుటుంబాల్లో, బంధువుల్లో ఆరోగ్య విషయాల పట్ల అవగాహన కల్పించాన్నారని అయన అన్నారు.ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం మాణిభూషణ్, రామరాజు, విజిత్, ట్టప్ప రఘు, సంతోష్, రాహుల్, శివాజీ, రంజిత్, రమేష్, తదితర బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…