పటాన్ చెరు
మాట ఇస్తే మడమతిప్పని నేతగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు జిన్నారం మండల పరిధిలోని ఏడు గ్రామపంచాయతీలకు 11 లక్షల రూపాయల విలువైన ట్రాక్టర్ ట్యాంకర్లను అందజేశారు. శనివారం పటాన్చెరు పట్టణ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులకు వీటిని అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ సమాజసేవలో జీఎంఆర్ ఫౌండేషన్ ఎల్లప్పుడు ముందు ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలోని 55 గ్రామ పంచాయతీలకు గానూ 45 గ్రామ పంచాయతీలకు జిఎంఆర్ పౌండేషన్ తరఫున ట్రాక్టర్లు, ట్యాంకర్లు అందించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
గ్రామ అవసరాలకు అనుగుణంగా వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానంగా హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపిటిసి వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, జిన్నారం మండల పార్టీ అధ్యక్షులు రాజేష్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…