Telangana

లింగ వ్యత్యాసాన్ని అరికట్టాలి : నేహా గుప్త…

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

కార్యాలయాలలో లింగ వ్యత్యాసం పెద్ద సమస్యగా మారిందని , దాని అరికట్టితే తప్ప సృజనాత్మకతను పెంపొందించలేమని , ఆవిష్కరణలను ప్రోత్సహించలేమని , కంపెనీలను అభివృద్ధి పధంలో నడపలేమని ఏజీఎస్ హెల్త్ డెరైక్టర్ నేహా గుప్తా అన్నారు . హైదరాబాద్ లోని గీతం బిజినెస్ స్కూల్ , మానవ వనరుల విభాగం ఆధ్వర్యంలో ‘ ఓ మహిళా నేతకు ఎదురయ్యే సవాళ్లు , అవకాశాలు ‘ అనే అంశంపై గురువారం ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు . నాయకత్వ స్థానాలలో మహిళలు అధిక సంఖ్యలో ఉండాలని సంవత్సరాల తరబడి మాట్లాడుతున్నా , ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈవోల జాబితాలో కేవలం ఆరు శాతం కంటే తక్కువగానే మహిళలున్నట్టు నాస్కామ్ గణాంకాలను ఉటంకిస్తూ ఆమె చెప్పారు . పరిశ్రమ వెవిధ్యమైన శ్రామిక శక్తిని గుర్తించినప్పటికీ కేవలం ఒక శాతం కంటే తక్కువగానే అంగవైకల్యం ఉన్న వారు పనిచేస్తున్నారని , ఇక నపుంసకుల సంఖ్య గురించి చెప్పనక్కలేదన్నారు . ఈ నపుంసకులకు ఇటు పని దొరకక , అటు కుటుంబాలు వెలివేస్తున్నాయంటూ ఆమె విచారం వెలిబుచ్చారు . ఈ పరిస్థితిని మార్చేందుకు సమాజంలో మరింత అవగాహన రావాలని , ఆయా సమస్యలపై తరచుగా చర్చించాలని , చైతన్య కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని నేహా గుప్తా పేర్కొన్నారు .

ప్రతి ఒక్కరికీ జీవితంలో సవాళ్లు ఎదురవుతాయని , ఒక్కసారి వాటిని అధిగమిస్తే అపార అవకాశాలు మనముందుంటాయని వర్ధమాన మేనేజర్లకు నేహా గుప్తా సూచించారు . కొత్త ఆలోచనలకు ప్రతిఘటన ఎప్పుడూ ఉంటుందని , దానిని అధిగమించి ముందుకు పోయే చొరవ మనలో ఉండాలని ఆమె స్పష్టీకరించారు . తొలుత , ఈ కార్యక్రమ నిర్వాహకురాలు డాక్టర్ నాగ రేఖ అతిథిని సత్కరించారు . విద్యార్థి ప్రతినిధులు మానస స్వాగతోపన్యాసం చేయగా , కీర్తన వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది . ప్రశ్నలడిగేలా విద్యార్థులను ప్రోత్సహించి , సందర్భోచితంగా జవాబులిచ్చి నేహా గుప్తా ఆకట్టుకున్నారు .

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

4 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago