మూడు రోజుల పాటు కొనసాగనున్న విద్యార్థుల వేడుక అలరించనున్న ప్రముఖులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్షిక ఉత్సవం. ప్రమాణ-2025 శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సాంకేతిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాల మేలు కలయిక అయిన ఈ వేడుక ప్రారంభోత్సవంలో సంగారెడ్డి జిల్లా ఎస్పీ సీహెచ్, రూపేష్ ముఖ్య అతిథిగా, SYNYCS గ్రూపు ముఖ్య కార్యనిర్వహణాధికారి, వ్యవస్థాపకుడు శ్రహంజ్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.
విశేషమైన విజయాల కోసం కృషి చేయాలని, అత్యుత్తమ ప్రదర్శనకు తమను తాము సన్నద్ధం చేసుకోవాలంటూ విద్యార్ధులను ఎస్పీ ప్రేరేపించారు. హద్దులను అధిగమించి ఆయా వ్యక్తుల అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా జీవితంలో రాణించాలని శ్రహంజ్ సూచించారు.గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, ప్రమాణ – 2025 అధ్యాపక సలహాదారు డాక్టర్ పి.త్రినాథరావు, డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ ప్రతినిధులు, పలువురు అధ్యాపకులు, తదితరులు ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. విద్యార్థులంతా క్రమశిక్షణతో ఆయా కార్యక్రమాలలో పాల్గొని, ఈ మూడు రోజుల వేడుకను విజయవంతం చేయాలని వారు కోరారు.
ప్రమాణ-2025 తొలి రోజు గీతం నమూనా ఐక్యరాజ్య సమితి (జీఎంయూఎన్), వయ్యారంగా చీర ధరించే కార్యశాల, క్లాసికల్-ఫ్యూజన్ డ్యాన్స్ పోటీలు, రంగోలి పోటీ, లైవ్ పెయింటింగ్-స్వెచింగ్, డిబేటీ పోటీలు, ఓపెన్ మైక్ లతో పాటు పలు వర్క్ షాపులు, రిక్రియేషనల్ థెరపీ, మెంటల్ హెల్త్ బింగో వంటి ఉత్తేజకరమైన సంక్షేమ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ప్రఖ్యాత కళాకారులు నికితా గాంధీ, మంగ్లీ తమ పాటలతో యువతను ఉర్రూతలూగించారు.ప్రమాణ-2025 విద్యార్థులు తమ సృజనాత్మకత, ఆవిష్కరణ, సమగ్రతను ప్రదర్శించడానికి ఒక శక్తివంతమైన వేదికగా ఉంటుందని హామీ ఇవ్వడమే గాక, అవధులు లేని ప్రతిభా స్ఫూర్తిని చాటిచెబుతోంది.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…