మనవార్తలు ,పటాన్ చెరు:
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ‘ వేడుకలలో భాగంగా , గీతం డీమ్డ్ విశ్వవిద్యాయలం , హెదరాబాద్ ప్రాంగణంలో సోమవారం 76 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించగా , జాతీయ గీతాలాపనతో పాటు ఎన్సీసీ విద్యార్థులు పరేడ్ను నిర్వహించారు . ఈ సందర్భంగా శాస్త్రీయ , సమకాలీన నృత్య ప్రదర్శనలు , దేశభక్తి గేయాలను విద్యార్థులు ఆలపించారు .
ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎస్ రావు మాట్లాడుతూ , విద్యార్థులు మన స్వాతంత్ర్య స్ఫూర్తిని గ్రహించి , ప్రగతిశీల దేశం కోసం నడుం బిగించాలని పిలుపునిచ్చారు . వేడుకలలో పాల్గొన్న వారందరికీ ఆయన తన హృ దయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు . ఈ వేడుకలలో గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ వర్మ , పలువురు డీన్లు , డెరైక్టర్లు , ప్రిన్సిపాళ్ళు , అధ్యాపకులు , విద్యార్థులు , సిబ్బంది , ఉపసిబ్బంది తదితరులు పాల్గొన్నారు . అందరికీ మిఠాయి , ఫలహారాలు , తేనీరును పంపిణీ చేశారు .
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…