మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లోని కళాకృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం ‘ ఓపెన్ మెక్ష్ ‘ కార్యక్రమాన్ని క్రీడా మైదానంలో ఘనంగా నిర్వహించారు . విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న నెపుణ్యాలను వెలికితీయడానికి దీనిని ఏర్పాటు చేశారు . పాటలు , నృత్యం , కవిత్వం చదవడం , సంగీతం , వాద్యపరికరాలను సృ జనాత్మకంగా వాయించడం , కథలు చెప్పడం , మె , మిమిక్రీ వంటి అనేక రకాల ప్రతిభను విద్యార్థులు ప్రదర్శించారు . స్టూడెంట్ లెఫ్ డెరైక్టరేట్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్ మాట్లాడుతూ , విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచేలా చెతన్యవంతులను చేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు .
కార్యక్రమ నిర్వాహక విద్యార్థి స్నేహిత్ మాట్లాడుతూ , ‘ ఓపెన్ మెక్ష్ ఎల్లప్పుడూ సాంస్కృతికంగా సాధికారత కలిగిస్తుంద’ని అన్నారు . సుజయ్ ( సాంస్కృతిక ) మహీంద్రా ( మార్కెటింగ్ ) వివియన్ ( సాహిత్య ) శ్రేయ ( నృత్యం ) ఆదిత్య ( సంగీతం ) సింధు ( కళలు ) శ్రీహరి ( గ్రాఫిక్ డిజెన్ ) ఆయా బృందాలకు నాయకత్వం వహించగా , స్టూడెంట్ లెఫ్ అసోసియేట్లందరూ ఈ కార్యక్రమ విజయవంతానికి తమవంతు సహాయ సహాకారాలను అందించారు . నిర్వాహకులను అధ్యాపకులు ప్రశంసించడమే గాక , ఇటువంటి కార్యకలాపాల వల్ల సహజమైన ప్రతిభ ఉన్న విద్యార్థులు వెలికివస్తారని ఆశాభావం వెలిబుచ్చారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…