పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు మండలం పాటి గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. బుధవారం రాత్రి పాటి గ్రామంలోని హనుమాన్ మందిరం వద్ద నెలకొల్పిన గణేష్ లడ్డు వేలంపాట కొనసాగింది. ఈ యొక్క వేలంపాటలో పాటి గ్రామ సర్పంచ్ మున్నూరు లక్ష్మణ్ రూ.11 లక్షల 1 రూపాయికి కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మున్నూరు లక్ష్మణ్ మాట్లాడుతూ… పాటి గ్రామంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే గ్రామస్తులు అందరం కలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నామని అన్నారు. కులమతాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలతో పాటు ప్రతి పండుగలను గ్రామస్తులందరం కలిసిమెలిసి జరుపుకుంటున్నట్లు తెలిపారు. వినాయకుడి కృపతో గ్రామస్తులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…