పటాన్ చెరు:
జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి ఉత్సవాలను గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో శనివారం ఘనంగా నిర్వహించారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ( ఇంజనీరింగ్ ) ప్రొఫెసర్ వీకే మిట్టల్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ , ఆర్కిటెక్చర్ , ఫార్మశీ ప్రిన్సిపాళ్ళు ప్రొఫెసర్ జీఏ రామారావు , ప్రొఫెసర్ సునీల్ కుమార్ , ప్రొఫెసర్ జీఎస్ కుమార్ , బీ – స్కూల్ ప్రొఫెసర్ ఏ.శ్రీరామ్ తదితరులు గాంధీ స్క్వేర్ లో నెలకొల్పిన మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , సత్యం , శాంతి , అహింసలకు గాంధీజీ ప్రాధాన్యం ఇచ్చి , ప్రపంచానికే మార్గదర్శకునిగా మారారని కొనియాడారు . గాంధీ త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు . గాంధీ మార్గాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నామని , మనమంతా అదే మార్గంలో పయనించాలని , అదే జాతిపితకు మనమిచ్చే అసలైన నివాళని వారు అభిప్రాయపడ్డారు . మహాత్మా గాంధీకి పలువురు విభాగాధిపతులు , అధికారులు , అధ్యాపకులు , సిబ్బంది తదితరులు కూడా నివాళి అర్పించారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…