పటాన్ చెరు:
జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి ఉత్సవాలను గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో శనివారం ఘనంగా నిర్వహించారు . గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్ ( ఇంజనీరింగ్ ) ప్రొఫెసర్ వీకే మిట్టల్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ , ఆర్కిటెక్చర్ , ఫార్మశీ ప్రిన్సిపాళ్ళు ప్రొఫెసర్ జీఏ రామారావు , ప్రొఫెసర్ సునీల్ కుమార్ , ప్రొఫెసర్ జీఎస్ కుమార్ , బీ – స్కూల్ ప్రొఫెసర్ ఏ.శ్రీరామ్ తదితరులు గాంధీ స్క్వేర్ లో నెలకొల్పిన మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , సత్యం , శాంతి , అహింసలకు గాంధీజీ ప్రాధాన్యం ఇచ్చి , ప్రపంచానికే మార్గదర్శకునిగా మారారని కొనియాడారు . గాంధీ త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు . గాంధీ మార్గాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనుసరిస్తున్నామని , మనమంతా అదే మార్గంలో పయనించాలని , అదే జాతిపితకు మనమిచ్చే అసలైన నివాళని వారు అభిప్రాయపడ్డారు . మహాత్మా గాంధీకి పలువురు విభాగాధిపతులు , అధికారులు , అధ్యాపకులు , సిబ్బంది తదితరులు కూడా నివాళి అర్పించారు .
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…