మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
స్వప్నికా రెహ ఫౌండేషన్ పలు సంస్థలు కలిసి రికాన్ఫస్ ఇండియా, జనహిత సేవ ట్రస్ట్, భారత్ వికాస్ పరిషత్, సంకల్పం ట్రస్ట్ లు కల్సి సంయుక్తంగా మియాపూర్ లోని నడిగడ్డ తండాలో ఉచిత మెడికల్ క్యాంప్ మరియు క్యాన్సర్ పై అవగాహన, సాధారణ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. డాక్టర్. సుమతి వాసుదేవన్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసారు.ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ భార్గవ్ కుచ్చు, కావ్య సంకా లు ఉచిత కన్సల్టేషన్ మరియు హిమోగ్లోబిన్ టెస్ట్ నిర్వహించి అవసరమైన మందులు పంపిణి చేశారు ఈ .కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్య లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగo చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వప్నిక రేహ ఫౌండేషన్ సభ్యులు మహాలక్ష్మి, పల్లవి, కొండల్ రావు, తనిష్కా, వినయ్, వేణు, దీప, కళ్యాణి, రీనా, మణికంఠ, రాజు, మహిపాల్, సత్య, జనహిత సేవా ట్రస్ట్ హెల్త్ కన్వీనర్ మధుకర్ మరియు ట్రస్ట్ సభ్యులు, మరియు నడిగడ్డ తండా కమ్యూనిటీ సభ్యులు స్వామి నాయక్, తిరుపతి నాయక్, హనుమాన్ నాయక్, గోపి నాయక్, దశరత్ నాయక్, రాఘవేంద్ర, తుకారాం నాయక్, లక్ పతి తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…