పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తొలి బ్యాచ్ విద్యార్థులకు (2018-23 విద్యా సంవత్సరం) బుధవారం వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ ఐదేళ్లలో ఎంతో ఉద్విగ్నభరిత, ఉత్సాహపూరిత క్షణాలను గుర్తుచేసుకోవడానికి, స్నేహితులు, ఉపాధ్యాయులు, జూనియర్లతో వారు గడిపిన సమయాన్ని మననం చేసుకోవడానికి ఈ వీడ్కోలు వేదిక తోడ్పడింది.కిన్నెర సెమినార్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమం, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ సునీల్కుమార్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైంది. తాము నిర్వహించిన విభిన్న కార్యక్రమాలు, వర్క్షాప్లోలో పాల్గొని, పరిపూర్ణతను పెంపొందించుకున్న విద్యార్థులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ‘ప్రయత్నించు, సేవ చేయి, వృ ద్ధిచెందు’ అనే గీతం నినాదాన్ని ముందుకు తీసుకెళ్లి, బయటి ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చివరి ఏడాది విద్యార్థులకు ఆయన ఉద్బోధించారు.ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు, విద్య పూర్తిచేసుకుని బయటకు వెళుతున్న విద్యార్థులను అభినందించారు. చిత్తశుద్ధితో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చన్నారు.ఆటపాటలు, సినీగీతాలకు తగిన లయబద్ధ నృత్యాలు, పాటలు, స్కిట్లతో సీనియర్లకు జూనియర్ విద్యార్థులు వీడ్కోలు పలికారు. ఐదేళ్ల తమ అనుభవాలను ఈ వేదిక నుంచి సీనియర్లు పంచుకోవడంతో పాటు ఆపాత మధురాలను గుర్తుచేసుకున్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…