Districts

భౌతిక , మిశ్రమ పదార్థాల వృద్ధిపై అధ్యాపక వికాస కార్యక్రమం…

మనవార్తలు,పటాన్ చెరు:

గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ భౌతిక , మిశ్రమ పదార్థాల ఆధునిక పోకడల’పై మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమం ( ఎస్ఓడీపీ ) ని మార్చి 23-25 తేదీలలో నిర్వహించనున్నట్టు ఆ విభాగాధిపతి డాక్టర్ సి.శ్రీనివాస్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . పదార్థ శాస్త్రం , సాంకేతికత అనేది భౌతిక లక్షణాలు , సూక్ష్మ నిర్మాణాలపై దృష్టిసారించే అంతర్ విభాగ అంశమన్నారు . పారిశ్రామిక , సామాజిక – ఆర్థిక వృద్ధికి అవసరమైన సాంకేతిక ప్రక్రియల కోసం వినూత్న పదార్థాల రూపకల్పన , అభివృద్ధితో పాటు పురోగతికి దారితీసినట్టు తెలిపారు . అదే సమయంలో కొన్ని కొత్త సమస్యలు కూడా వెలుగులోకి వచ్చాయన్నారు . నానోమెటీరియల్స్ , నానాటెక్నాలజీ , స్మార్ట్ మెటీరియల్స్ , ఎనర్జీ స్టోరేజ్ అప్లికేషన్ల కోసం హైఎంట్రోపీ మెటీరియల్స్ వంటి అంశాలపై ఈ మూడు రోజుల అధ్యాపక వికాస కార్యక్రమంలో విరివిగా చర్చిస్తారని తెలిపారు .

విద్యా సంస్థలు , పరిశ్రమ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులతో కీలక ఉపన్యాసాలు , మరో ముగ్గురు నిపుణులతో చర్చలు , రెండు ప్రయోగాత్మక శిక్షణ కార్యక్రమాలు , పరిశ్రమ నిపుణులతో ప్యానెల్ చర్చ వంటివి ఉంటాయన్నారు . పేర్ల నమోదు , వసతి తదితర వివరాల కోసం https://forms.gle/Gb3hnlJbkaUQspPG9 లాగిన్ అవ్వాలని , డాక్టర్ వి.జీవన్ , సమన్వయకర్త ( 77948 35203 ) ని సంప్రదించాలని లేదా jvemula@gitam.edu కు ఈ – మెయిల్ చేయాలని ఆయన సూచించారు

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

4 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago