మనవార్తలు ,పటాన్ చెరు:
గీతం బీ – స్కూల్ , హైదరాబాద్ లోని అకౌంటింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ ఎస్ఎస్ఎస్ – ఏఎంవోఎస్ని వినియోగించి స్ట్రక్చరల్ ఈక్వేషన్ మోడలింగ్’పై ఈనెల 14-15 తేదీలలో రెండు రోజుల ఆస్ట్ అధ్యాపక వికాస కార్యక్రమాన్ని ( ఎస్ఓపీ ) నిర్వహించనున్నారు . బీ – స్కూల్ డెరెక్టర్ డాక్టర్ కరుణాకర్ బి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . P ఎస్పీఎస్ఎస్ – ఏఎంఐఎస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎస్ఈఎంకి సంబంధించిన ప్రాథమిక అంశాలను పరిచయం చేయడం , దానిని వినియోగించే పద్ధతులు , సాధనాలపై వివరణాత్మక అవగాహనను కల్పించడం , అలాగే వివిధ అధునాతన ఎస్ఈఎం సాంకేతికతలను ఉపయోగించి సిద్ధాంతిక , ఆచరణాత్మక అనుభవాన్ని సమతుల్యంగా అందించే లక్ష్యంతో ఈ ఎఫ్ఎపీని నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు .
పీజీ విద్యార్థులు , రీసెర్చ్ స్కాలర్లు , అధ్యాపకులు , కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు , ఇండస్ట్రీ ప్రాక్టీషనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు . ఇందులో పాల్గొన దలచిన వారికి ఎస్ఎఎస్ఎస్తో గణాంక సాధనపై ప్రాథమిక అవగాహన ఉండాలని , అలాగే ఎస్ పీఎస్ఎస్ – ఏఎంవోఎస్ లోడ్ చేసిన కంప్యూటర్ ఉండాలన్నారు . లక్నో విశ్వవిద్యాలయంలోని గణాంక విభాగాధిపతి ప్రొఫెసర్ మసూద్ హెచ్ . సిద్దిఖీ ; లండన్లోని అనలిటిక్స్ ఇన్స్టిట్యూట్ జాతీయ అధిపతి డాక్టర్ వినోద్ కుమార్ మూర్తి ; కార్యక్రమ నిర్వాహకుడు డాక్టర్ గుత్తి ఆర్కే ప్రసాద్లు ప్రధాన వక్తలుగా ఈ 12 గంటల ఆన్లైన్ – డెరైక్ట్ టు డివెస్ట్ మోడ్లో నిర్వహించే ఎఫ్ పీలో పాల్గొంటారని తెలియజేశారు . ఆసక్తి ఉన్న వారు తమ పేరు నమోదు , ఇతరత్రా వివరాల కోసం కార్యక్రమ సహ – నిర్వాహకుడు డాక్టర్ సయ్యద్ జాఫర్ ( 98485 33864 ) ని సంప్రదించాలని లేదా sjaffer@gitam.edu కు ఈ – ఎయిల్ చేయాలని డెరైక్టర్ సూచించారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…