50 లక్షల రూపాయల సొంత నిధులతో ధ్యాన మందిరం
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావం పెంపొందించుకోవాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ సిద్ధి గణపతి దేవాలయం ఆవరణలో 50 లక్షల రూపాయల సొంత నిధులచే ధ్యాన మందిరాన్ని నిర్మించడం జరిగిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం శ్రీ సిద్ది గణపతి దేవాలయంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని గురువారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని గ్రామాలలో నూతన దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మించి ప్రతి ఒక్కరిలో పరమత సహనాన్ని పెంపొందించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, గ్రామ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…