శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది కి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరుతూ ఎ ఐ టి యూ సి అనుబంధ సంస్థ అవుట్ సోర్సింగ్ సిబ్బంది శుక్రవారం రోజు కొండాపూర్ లోని రంగారెడ్డి జిల్లా ఆసుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న తమకు కార్మిక జీవో ప్రకారం 13600 వేతనం ఇవ్వాల్సి ఉండగా కేవలం 11 వేలు మాత్రమే చెల్లెస్తున్నారని, అదికూడా మూడు, నాలుగు నెలలకు ఒకసారి చెల్లెస్తూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పై ఆసుపత్రి సూపరిండెంట్ కు వినతి పత్రం ఇచ్చామని, మా డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో శ్రావణ్ కుమార్ యాదవ్ రాజు, భాగ్య, మల్లేశ్వరి, అనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఆసుపత్రి లో 45 మంది అవసరం ఉండగా, 40 మంది మాత్రమే పనిచేస్తున్నారని, సెక్యూరిటీ విభాగం లో 12 మంది ఉండగా 8 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…