మనవార్తలు ,శేరిలింగంపల్లి :
మారుతున్న విద్యావిధానానికి అనుగుణంగా విద్యాబోధన జరగాలని ప్రముఖ విద్యావేత్త, ఎన్ సి ఈ ఆర్ టి రీసెర్చ్ పర్సన్ డాక్టర్ రామకృష్ణ ఆధురి అన్నారు. బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యాలయ ఉన్నత పాఠశాల లో బుధవారం నాడు ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్ కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రామకృష్ణ ఉపాద్యాయులందరికి నూతన విద్యా విధానం గురించి ఎన్నో మెళుకువలను వివరించారు.
అదే విధంగా ఉపాద్యాయులందరూ పరస్పర సహకారంతో విధులను నిర్వహించటం, విద్యార్థులు ఎదుర్కొంటున్న రకరకాల విద్యాపరమైన సమస్యలను అధిగమించడానికి వివిధ రకాల సూచనలను అందించారు. ఇటువంటి శిక్షణా తరగతులను నిర్వహించడం ద్వారా మారుతున్న నూతన విద్యా విధానాలకు అనుగుణంగా తమ ఉపాద్యాయుల బృందం కూడా సన్నద్ధంగా ఉండేలా జ్యోతి విద్యాలయ ఉన్నత పాఠశాల యాజమాన్యం సర్వదా కృషి చేస్తున్నారని తెలిపారు. గుడ్ లర్నింగ్ ఇన్ యాక్షన్ పేరుతో విద్యార్థులకు సులభంగా పాఠాలు అర్థమయ్యేలా బోధించడం ఎలా అనేది కూడా వివరించినట్లు అధ్యాపకుల బృందం తెలిపింది.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…